తెలంగాణ మంత్రి కేటీఆర్ శనివారం సిరిసిల్ల నియోజకవర్గంపై హైదరాబాద్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిశుభ్ర సిరిసిల్ల లక్ష్యంగా పారిశుద్ధ్య ప్రణాళికలు ఉండాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. గ్రామ పారిశుద్ధ్య ప్రణాళికలో భాగంగా రూపొందించిన కార్యక్రమాల అమలుపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. 30 రోజుల గ్రామ ప్రణాళికను విజయవంతంగా పూర్తిచేసిన అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి అభినందనలు తెలిపారు.
next post