తెలంగాణ ఐటీ, పురపాలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. హకీంపేట దగ్గర మియాపూర్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు బైక్ అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురై య్యారు. రాత్రి సమయంలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇంతలో సిరిసిల్ల పర్యటనను ముగించుకొని హైదరాబాద్కు బయలుదేరారు మంత్రి కేటీఆర్.. మధ్యమార్గంలో రోడ్డు ప్రమాద ఘటనను గమనించిన మంత్రి కేటీఆర్ తన కాన్వాయ్ ని ఆపి క్షతగాత్రులను తన ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కేటీఆర్ వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించి తిరిగి ప్రయాణమయ్యారు.
మోదీని సంతృప్తి పరచడానికే ఎగ్జిట్ పోల్స్: విజయశాంతి