టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. శనివారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ కుటుంబం గురించి పిచ్చిగా మాట్లాడితే.. బాబు కుటుంబ బండారాన్ని బయటపెడతానన్నారు. జగన్ను విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు.
జగన్ చిటికేస్తే ప్రతిపక్ష హోదా కాదు.. ఏకంగా టీడీపీని తీసుకొచ్చి స్టోర్ రూమ్లో పెట్టిస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డ్రామాలు 40 ఏళ్లుగా చూస్తున్నారని చెప్పారు. దేవినేని, యనమల లాంటి బ్రోకర్లతో మాట్లాడించొద్దంటూ అని మండిపడ్డారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ వల్లే టీడీపీలో సంక్షోభం ఏర్పడిందన్నారు. ఇసుక దీక్ష చేస్తే 23 మంది ఎమ్మెల్యేలకు 9 మందే వచ్చారని అయినా హిట్ అని చెప్పుకుంటున్నారని విమర్శించారు.