దేశంలోథర్డ్ వేవ్ మొదలైంది. రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నాయి.
తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. తాజాగా జరిపించిన కరోనా పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదిలాఉంటే.. టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సైతం కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కన్పించగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్య పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన కూడా ఏఐజీలో చేరి చికిత్స పొందుతున్నారు.
ఈనెల 9న కంచికచర్లలో రంగా విగ్రహావిష్కరణలో మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధాలు కలిశారు..అంతేకాకుండా. అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు కోరాన బారిన పడడం కలకలం రేపుతోంది.
.
చంద్రబాబు, లోకేష్ ఆరిపోయే దిపాలు- రోజా హాట్ కామెంట్స్