తెలంగాణ బీజేపీ ఎంపీ, కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి మరిన్ని బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖ కార్యాలయం ఓ ప్రకటనవిడుదల చేసింది.
వామపక్ష తీవ్రవాద విభాగం, పోలీసు శాఖ ఆధునికీకరణ బాధ్యతలను కిషన్ రెడ్డికి అప్పగించారు. వీటితో పాటు మహిళల భద్రత జ్యుడీషియల్ డివిజన్ లను కూడా కిషన్ రెడ్డికే అప్పగిస్తున్నట్టు హోమ్ శాఖ కార్యాలయం తెలిపింది. ఈ విభాగాలన్నీ తక్షణం కిషన్ రెడ్డి మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయని వెల్లడించింది.
పవన్ రాజకీయ బినామీ.. టీడీపీ గొంతును వినిపిస్తున్నారు: బొత్స