గత ప్రభుత్వం చేసిన అశ్రద్ధ వల్లే ప్రస్తుతం విత్తనాల కొరత ఏర్పడిందని ఏపీ వ్యవసామశాఖ మంత్రి కన్నబాబు ఆరోపించారు. . పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ జయంతి రోజున రైతు దినోత్సవం వేడుకలు జరపబోతున్నామని తెలిపారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పునరుధ్ఘాటించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం దురదృష్టకరమని, తీవ్రంగా నష్టపోయిన శనగ రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు చీని రైతులను ఆదుకునేందుకు ట్యాంకర్లతో సాగు నీటిని అందిస్తామని పేర్కొన్నారు.