telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ సారధ్యంలో ప్రజా రంజక పాలన: జగదీశ్ రెడ్డి

Jagadish Reddy,KCR

తెలంగాణ సీఎం కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రంలో ప్రజా రంజక పాలన సాగుతోందని విద్యాశాఖ మంత్రి మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పేదరికాన్ని పోగొట్టి, సస్యశ్యామలం చేయడమే సీఎం కేసీఆర్ సంకల్పం అని అన్నారు.

2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే మార్పు ప్రారంభమయ్యిందన్నారు. రాష్ట్ర సంపదను పెంచి ప్రజలకు పంచుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రజల సాగునీటి కలను సాకారం చేస్తున్నారని చెప్పారు.నేడు ప్రజలంతా గౌరవంతో మురిసిపోతున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ నీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.

Related posts