రూ.400 కోట్లతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ది చేస్తున్నామని తెలంగాణ అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తో కలిసి మంత్రి కాళేశ్వరం జలాలను మిడ్ మానేరు ద్వారా వేములవాడ గుడి చెరువులోకి ఈ రోజు నీటిని వదిలారు.
అంతరం గుడి చెరువు వద్ద పూజలు చేసి గంగమ్మకు హారతినిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ కనీవినీ ఎరుగని రీతిలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. మిని ట్యాంక్ బండ్ ను నిర్మించి సుందరీకరణ పనులు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్ పర్సన్ అరుణ, తదితరులు పాల్గొన్నారు.