telugu navyamedia
తెలంగాణ వార్తలు

సివిల్స్ ర్యాంకర్స్‌కు మంత్రి హరీశ్ రావు అల్పాహార విందు..సన్మానం

సివిల్స్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన కొంద‌రి విజేతలను తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్ లోని త‌న నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు.

సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, మెంటార్ అయిన మల్లవరపు బాలలత నేతృత్వంలో ర్యాంకులు సాధించిన వారు మంత్రి హరీష్ రావును కలిశారు. 69వ ర్యాంకర్ గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి, 136వ ర్యాంకర్ అరుగుల స్నేహ, 161 ర్యాంకర్ బొక్కా చైతన్యరెడ్డి, 574వ ర్యాంకర్ రంజిత్ కుమార్, 676వ ర్యాంకర్ బి. స్మరణ్ రాజ్‌ను మంత్రి హరీష్ రావు ఘనంగా సన్మానించారు.

Thumbnail image

ఈ సంద‌ర్భంగా సివిల్స్ పరీక్షలలో ర్యాంకులు సాధించడం ద్వారా తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా నిలిచారని మంత్రి అభినందించారు. స్వయంగా ఐఏఎస్ అయిన బాలలత మేడం హైదరాబాద్ లో ఐఏఎస్ శిక్షణ సంస్థ సీఎస్‌బీ అకాడమీని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 100 మందికి పైగా సివిల్స్ విజేతలను తీర్చిదిద్దడం గర్వకారణమని అభినందించారు.

సీఎస్‌బీ అకాడమీ నుండి భవిష్యత్తులో మరింత మంది విజేతలు రావాలని, దేశానికి అత్యున్నత సేవలు అందించాలని హరీష్ రావు ఆకాంక్షించారు. సివిల్స్ విజేతలను సన్మానించి ప్రోత్సహించినందుకు మంత్రికి బాలలత మేడం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts