telugu navyamedia
ఆంధ్ర వార్తలు

దుబాయ్ టూర్‌లో గౌతమ్‌రెడ్డికి గుండె వార్నింగ్..!

*దుబాయ్‌టూర్‌లో ఉండ‌గానే గాత‌మ్‌రెడ్డికి గుండె వార్నింగ్‌..
*ఎక్స్‌పోలో ఉన్న‌ప్పుడు గుండెపై గౌత‌మ్‌రెడ్డి ఛాతిపై రుద్దుకుంటూ ఒత్తుకోవ‌డం క‌నిపించింది..
*ఛాతిపై రుద్దుకుంటూ ఒక‌టి రెండూ సార్లు క‌నిపించిన గౌత‌మ్‌
*దూబాయ్‌లో ఉన్న‌ప్ప‌డే గాత‌మ్‌రెడ్డికి హ‌ర్ట్ స్టోక్ స్టార్ట్‌ అయ్యింద‌ని వైద్యులు వెల్ల‌డి…

ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమ‌వారం ఉద‌యం హఠాన్మరణం చెందారు. మంత్రి గౌతమ్ రెడ్డి ఇటీవలే వారం పాటూ దుబాయ్‌లో పర్యటించారు.. 

అయితే దుబాయ్‌టూర్‌లో ఉండ‌గానే గాత‌మ్‌రెడ్డికి గుండె వార్నింగ్ ఇచ్చిన‌ట్లు ఓ వీడియోలో క‌నిపించింది. పదే పదే ఛాతిని నిమురుకోవడం వంటి దృశ్యాలు వీడియోలో కనిపించాయి.

దుబాయ్‌లో జరిగిన ఇండియన్ ఎక్స్ పోలో వివిధ ప్రముఖ కంపెనీలకు చెందిన సీఈవోలు, ప్రతినిధులతో మంత్రి గడిపారు. కొంత మందితో ఎంవోయూలు చేసుకున్నారు. ఆ సందర్భంగా తీసిన వీడియోలను పరిశీలించగా.. మంత్రి అప్పుడే కాస్త అసౌకర్యానికి లోనైనట్లుగా కనిపిస్తోంది. 

సహజంగానే అందరం గ్యాస్ట్రిక్ అని భావించి లైట్ తీసుకుంటాం. ఇక్కడ గౌతమ్‌రెడ్డి విషయంలోనూ అదే జరిగినట్లు కనిపించింది గానీ.. దాని ఎఫెక్ట్‌ మరో రెండురోజుల తర్వాత కనిపించింది. సోమ‌వారం ఉద‌యం పూర్తిగా గుండె ఆగిపోయింది.

ఆయన మంత్రి హోదాలో దుబాయ్‌లో మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. పెట్టుబడుల కోసం దుబాయ్ వెళ్లిన మంత్రి.. తిరిగి ఏపీకి వెళ్లకుండానే కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది.

కాగా.. ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్‌ కాలేజీ ఆవరణలో రేపు ఉదయం 11 గంటలకు అధికారిక లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు.

ఆయన హఠాన్మరణంతో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Related posts