టీఆర్ఎస్ హయాంలోనే నగరాల్లో అభివృద్ది మొదలైందని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీతారాంపూర్ తో పాటు పలు డివిజన్ల్లో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మున్సిపాలిటీలకు నిధులు కేటాయించలేదనీ, సీఎం కేసీఆర్ నగరపాలక సంస్థకు ఏటా రూ.వంద కోట్ల నిధులు ఇస్తున్నారని తెలిపారు.
నగరాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో ప్రేమతో నిధులు ఇచ్చారనీ, ఇప్పటికే కారీంనగర్ నగరంలో రోడ్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు. త్వరలోనే రాష్ట్రంలో రెండో స్థానంలో ఉండే విధంగా కరీంనగర్ను అభివృద్ధి చేస్తామన్నారు. టీఆర్ఎస్ను గెలిపిస్తేనే ప్రస్తుతం సాగుతున్న అభివృద్ధి ముందుకు వెళ్తుందనీ అన్నారు. విపక్షాలను ఎన్నుకుంటే అభివృద్ది నిలిచిపోతుందని మంత్రి స్పష్టం చేశారు.
ఏపీలో వైసీపీ గెలిస్తే కేసీఆర్ గెలిచినట్టే: పవన్ కల్యాణ్