telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్‌ ను కరోనా బారి నుంచి కాపాడుకున్నాం: ఈటల

Etala Rajender

హైదరాబాద్‌ నగరాన్ని కరోనా వైరస్‌ బారి నుంచి కాపాడుకున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శుక్రవారం మల్లాపూర్‌ డివిజన్‌ ఎస్‌వి నగర్‌లో ఏర్పాటుచేసిన బస్తీదవాఖానాను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలుచేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ముంబై, థానే వంటి, పూనె నగరాలలో నెలకొన్న పరిస్థితితులను అర్ధం చేసుకోండి.

ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని మంత్రి విజ్ఞప్తిచేశారు. మాకేమవుతుందన్న నిర్లక్ష్యం మాత్రం ఉండొద్దన్నారు.కరోనా వైరస్‌ పై భయం తొలగిపోయినా ఎవరి వారు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా బారిన పడకుండా ఉండాలని సూచించారు. వివిధ రాష్ర్టాలకు పనులకోసం వెళ్లి ప్రభుత్వం కల్పిస్తున్నవెసులుబాటుతో తిరిగి రాష్ర్టానికి వచ్చిన వారిలో అనేక మందికి పాజిటివ్‌ వచ్చినట్టు ఆయన వివరించారు.

Related posts