లాక్డౌన్లో పేదలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటోందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లిదయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వివిధ స్వచ్చంద సేవా సంస్థలందిస్తున్న నిత్యావసర సరుకులను నిరుపేదలు, ఆశావర్కర్లకు పంపిణీ చే శారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందన్నారు. ఈ కష్టకాలంలో నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎంతో ప్రయత్నిస్తోందన్నారు. అయినా దాతలు, స్వచ్చంద సంస్థలు కూడా చేయూతనివ్వాలని ఆయన అన్నారు. ప్రజలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.