telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం: మంత్రి ఎర్రబెల్లి

Minister Erraballi comments Congress

లాక్‌డౌన్‌లో పేదలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటోందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో వివిధ స్వచ్చంద సేవా సంస్థలందిస్తున్న నిత్యావసర సరుకులను నిరుపేదలు, ఆశావర్కర్లకు పంపిణీ చే శారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందన్నారు. ఈ కష్టకాలంలో నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎంతో ప్రయత్నిస్తోందన్నారు. అయినా దాతలు, స్వచ్చంద సంస్థలు కూడా చేయూతనివ్వాలని ఆయన అన్నారు. ప్రజలు కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

Related posts