telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బిజెపి ఎంపీలు మూర్ఖంగా మాట్లాడుతున్నారు…

Errabelli Trs

ఫీల్డ్ అసిస్టెంట్ లు లేకపోవడం బాధాకరం. వాళ్ళ మీద ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కి సానుభూతి ఉందని… ఇంకా వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలిపారు. కరోనా వల్ల రాష్ట్రం చాలా వెనకకు పోయిందని.. అయినా సరే, సీఎం కేసీఆర్‌ అన్ని ముఖ్యమైన పథకాలను కొనసాగిస్తున్నారన్నారు.  కొందరు గిట్టని వాళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారని.. కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైన స్థాయిలో మన రాష్ట్రానికి సహకారం అందించడం లేదని మండిపడ్డారు. బిజెపి ఎంపీలు మూర్ఖంగా మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కనీసం వాళ్ళ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోలేని దద్దమ్మలు అని ఫైర్‌ అయ్యారు.   రైల్వేను  మోడీ ప్రైవేట్ కి అప్పగించారని ఆగ్రహించారు.  అన్నీ ప్రైవేట్ పరం చేస్తే రేపు మన నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయా? మన రిజర్వేషన్లు కూడా పోయేటట్లు కుట్ర జరుగుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణ లాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని గుర్తు చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణీదేవి లను గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. చూడాలి మరి ఈ ఎన్నికలో ప్రజలను ఎవరిని ఎన్నుకుంటారు అనేది.

Related posts