telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పవన్ రాజకీయ బినామీ.. టీడీపీ గొంతును వినిపిస్తున్నారు: బొత్స

టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ బినామీ అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అందుకే టీడీపీ గొంతుకను పవన్ వినిపిస్తున్నారని విమర్శించారు. జగన్ వంద రోజుల పాలనకు 100 మార్కులు పడ్డాయని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగబోదని తెలిపారు. రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తామని బొత్స చెప్పారు.

అమరావతి నిర్మాణానికి మూడు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు. అమరావతితో పాటు అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అమరావతి పంచ బ్యాంక్ తనంతట తానే వెనక్కి వెళ్లలేదని, కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ప్రపంచ బ్యాంకు తప్పుకుందని తెలిపారు. సంక్షేమ పథకాలకు సాయం చేసేందుకు వరల్డ్ బ్యాంక్ ఇప్పటికీ సిద్ధంగా ఉందని చెప్పారు. విశాఖ భూ కుంభకోణంలో ఏ పార్టీవారు ఉన్నా వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు.

Related posts