telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రాంతాలకు అతీతంగా ఏపీ అభివృద్ధి: మంత్రి అవంతి

avanthi srinivas minister ap

ప్రాంతాలకు అతీతంగా ఏపీని అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్‌ అభిమతం అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ అవసరమన్న జగన్‌ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు.

విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా చేయడంతో ఉత్తరాంధ్ర అంతా అభివృద్ధి సాధిస్తుందన్నారు. పక్క రాష్ట్రంలో యువతిపై దాడి జరిగితే.. మన రాష్ట్రంలో దిశ చట్టం ప్రవేశపెట్టారని టెయిపారు. ఈ చట్టం తీసుకువచ్చి మహిళలకు సీఎం జగన్‌ అండగా ఉన్నారన్నారు. ప్రజల మధ్య కుల,రాజకీయ విద్వేషాలను సృష్టించడం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి అలవాటని మంత్రి అవంతి మండిపడ్డారు.

Related posts