పౌరసత్వ చట్టం ( సీఏఏ) పై ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మరోవైపు ఈ చట్టాన్ని అనుమతించమని, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న పలు రాష్ట్రాలు ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాలు సీఏఏను వ్యతిరేకిస్తూ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశాయి.
ఈ నేపథ్యంలో, సీఏఏపై సరికొత్త వాదనను షా తెరపైకి తెచ్చారు. ఈ చట్టాన్ని వ్యతిరేకించేవారంతా దళిత, పేదల వ్యతిరేకులని వ్యాఖ్యానించారు. మన దేశంలో ఉన్న 70 శాతం మంది శరణార్థులు దళితులేనని అమిత్ షా చెప్పారు. వీరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం ద్వారా మీరు ఏం సాధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ చట్టాన్ని ముస్లిం వ్యతిరేక చట్టమని నిరూపించాలని సవాల్ విసిరారు.
ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే తట్టుకోలేక అభాండాలు: జగన్