మహేష్ బాబు హీరోగా నటించిన “1 నేనొక్కడినే” చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ తాజాగా దినేష్ విజన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న “మిమి” అనే సినిమా చేస్తుంది. “మిమి” చిత్రం మరాఠీ మూవీ మాలా ఐ వైచై ఆధారంగా రూపొందుతుంది. “లుకా చుప్పి” దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించిన మిమి చిత్రంలో పంకజ్ త్రిపాఠి లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈ మూవీని దినేష్ విజన్, మాడాక్ చిత్రాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సరోగసి ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా షేర్ చేసింది కృతి. “జీవితం ఊహించని అద్భుతాలతో నిండిన ప్రయాణం.. మునుపెన్నడు లేని విధంగా ఓ ప్రయాణానికి సిద్ధం కండి. మిమి .. చాలా ప్రత్యేకమైనది” అని కృతిసనన్ తన కామెంట్లో తెలిపింది. పోస్టర్లో మనం రెండు చేతులు గమనించవచ్చు. ఒక చేతిలో శిశువు ఉండగా, ఆ చేయి బేబిని ఇచ్చేందుకు సిద్ధం అన్నట్టుగా ఉంది. మరో శిశువు స్వీకరించడానికి వేచి చూస్తున్నట్టుగా ఉంది.
next post