telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ సైతం బీజేపీ, మజ్లిస్ తో మైత్రి: ఉత్తమ్

uttam congress mp

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ, మజ్లిస్, టీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పించారు. జాతిపిత గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్ లో ఆయన నివాళులు అర్పించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ సైతం బీజేపీ, మజ్లిస్ తో మైత్రి కొనసాగిస్తోందని ఆరోపించారు. ఈ మూడు పార్టీలు గాంధీ సిద్ధాంతాలను పట్టించుకోకుండా మత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

బీజేపీ గాంధీ సిద్ధాంతాలను తుంగలో తొక్కి మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం మహాత్ముడి సిద్ధాంతాలే ఊపిరిగా ముందుకు సాగుతోందని, దేశంలో పరమత సహనం ఉండాలన్న గాంధీ అభిమతాన్ని పాటిస్తోంది కాంగ్రెస్ మాత్రమేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్ఘాటించారు.

Related posts