telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎన్నార్సీ అమలు చేయొద్దని తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఒవైసీ విజ్ఞప్తి

asaduddin owisi

ఎన్నార్సీ అమలు చేయొద్దని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులను మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. మజ్లిస్‌ పార్టీ 62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా గుంటూరులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎన్నార్సీ అమలైతే ముస్లింలు సహా ఎనిమిది కోట్ల మంది పేర్లు కనిపించకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీలో ఇటీవల జరిగిన హింసాకాండకు మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మోదీ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే వారం ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్ సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెడతారని అసద్ తెలిపారు.

Related posts