మైకేల్ వాన్ తాజాగా ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ను ఉద్దేశించి కూడా కోహ్లీసేనపై విషాన్ని చిమ్మాడు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నామే ప్రారంభం కావాల్సిన ఈ మెగా ఫైనల్కు వర్షం ఆటంకం కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ మెగా మ్యాచ్ వేదికైన సౌతాంప్టన్లో గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దాంతో అంపైర్లు టాస్ వేయకుండానే ఫస్ట్ డే ఫస్ట్ సెషన్ ఆటను రద్దు చేశారు. దాంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు వర్షంతో బతికిపోతుందని మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై భారత అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అయితే తనదైన శైలిలో బదులిచ్చాడు. లాగాన్ సినిమాలోని ఓ సన్నివేశాన్ని మీమ్గా బదులిచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ను ఇతర జట్లు గోతికాడి కప్పల్లా చూస్తున్నాయనే అర్థం వచ్చేలా క్యాప్షన్గా పేర్కొన్నాడు. ఇక మైకేల్ వాన్ ఏదీ చెప్పినా దానికి వ్యతిరేకంగా జరుగుతుందని, అతను భారత్ ఓడిపోతుందనుకుంటున్నాడని, చాంపియన్గా నిలిచేది కోహ్లీసేననే అని కామెంట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు కూడా ఇదే తరహా అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేశాడని, కోహ్లీ లేకుండా గెలవలేదని ఖునీ రాగాలు తీసాడని గుర్తు చేస్తున్నారు.
previous post
కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్..చంద్రబాబుకు గిఫ్ట్ గా మారుతుంది: పవన్