ఇండోనేషియాలో 23వ ప్రెసిడెంట్స్ బాక్సింగ్ కప్ పోటీ జరుగుతుంది. ఈ పోటీలో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ సత్తా చాటింది. ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్గా కీర్తి గాంచిన మేరీకోమ్ మహిళల 51 కేజీల బాక్సింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది.
ఫైనల్లో ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఏప్రిల్ ఫ్రాంక్స్ను 5-0తో ఓడించి స్వర్ణ పతాకాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.