నిఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా “అర్జున్ సురవరం”. ప్రముఖ నిర్మాత ‘ఠాగూర్’ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పి బ్యానర్పై రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మాతగా టి.సంతోష్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. లావణ్య త్రిపాఠి హీరోయిన్. పోసాని కృష్ణమురళి, సత్య, తరుణ్ అరోరా, వెన్నెల కిషోర్, నాగినీడు, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటించారు. సామ్ సి.ఎస్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలో చిత్ర ప్రచారంలో భాగంగా ఈనెల 26న హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవిని ఆహ్వానించారు. సినిమా ప్రమోషన్లో భాగంగా సినిమాకు సంబంధించి `కన్నె కన్నె..` అనే వీడియో సాంగ్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందమైన ఫారిన్ లొకేషన్స్లో చిత్రీకరించిన ఈ పాటకు మంచి స్పందన వస్తుంది.
మీకేం పోయేకాలం… బాహుబలి తరువాతే కదరా మీరిద్దరూ… హీరోలపై తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలు