telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగశౌర్య తండ్రి ఇబ్బంది పెట్టడం నిజమే… : మెహ్రీన్ – మెహ్రీన్

Mehreen

నాగశౌర్య, మెహ్రీన్ జంటగా నటించిన సినిమా ‘అశ్వథ్ధామ’. రమణ తేజ దర్శకత్వం వహించారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై నాగశౌర్య తల్లిదండ్రులు నిర్మించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో మెహ్రీన్‌ను నాగశౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ ఇబ్బందిపెట్టినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మెహ్రీన్ క్లారిటీ ఇచ్చారు.

‘‘అశ్వథ్థామ ప్రమోషన్స్ సమయంలో నా హోటల్ బిల్స్ విషయంపై ఇటీవల కాలంలో వస్తున్న వార్తలపై నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. నేను మౌనంగా ఉండాలని అనుకున్నాను. కానీ నాపై నిందలు వేస్తున్నారు. కాబట్టి నా సైడ్ నుంచి ఏం జరిగిందో వివరించాలని అనుకుంటున్నాను. ప్రమోషన్స్ పూర్తయ్యాక పంజాబ్‌లో ఉన్న నా కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లాను. ఆ తర్వాత హైదరాబాద్‌ వచ్చి మళ్లీ ప్రమోషన్స్‌లో పాల్గొన్నాను. మా తాతయ్యకు హార్ట్‌ఎటాక్ వచ్చి హాస్పిటల్‌లో ఉన్నప్పటికీ నేను ప్రమోషన్స్ కోసం వచ్చాను. చాలా ఇంటర్వ్యూలో నా కోస్టార్ నాగశౌర్య కూడా ఈ విషయాన్ని చెప్పారు. అశ్వథ్థామ’ సినిమాకు సంబంధించి అన్ని ప్రమోషన్స్‌లో పాల్గొన్నాను కానీ ఒక్క ఇంటర్వ్యూకు మాత్రం హాజరుకాలేకపోయాను. ఎందుకంటే నాకు అలెర్జీ వచ్చింది. నా ముఖంపై ఎర్రటి మచ్చలు ఏర్పడ్డాయి. నేను డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను నిర్మాతలకు పంపించి ఇంటర్వ్యూకు రాలేకపోతున్నందుకు క్షమాపణలు చెప్పాను. అయితే నిర్మాతలకు నేను రాకపోవడం నచ్చలేదో ఏమో నేను బస చేసిన హోటల్ బిల్స్ కట్టలేమని చెప్పారు. నా మేనేజర్ చేత నిర్మాతలకు ఫోన్ చేయించి బిల్లులు కట్టాలని చెప్పాను. కానీ వాళ్లు స్పందించలేదు. దాంతో నా తరఫున నా మేనేజర్‌నే హోటల్ బిల్స్ అన్నీ కట్టేయమని చెప్పాను. ఆ తర్వాత వచ్చిన వార్తలన్నీ నేను ఎన్నో బాధలు పడి నిర్మించుకున్న నా కెరీర్‌పై ప్రభావం చూపే విధంగా ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో నేను 14 సినిమాల్లో నటించాను. కొన్ని సందర్భాల్లో నాకు ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ నేను ఎలాంటి వంకలు పెట్టకుండా నా బాధ్యతలు నేను నిర్వర్తించాను. నాకు ఎప్పుడూ నిర్మాణ సంస్థలతో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి నా కెరీర్‌పై ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను. ‘అశ్వథ్థామ’ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు ఐరా క్రియేషన్స్‌కు ధన్యవాదాలు. ఇకపై ఈ సంఘటన నుంచి నా నుంచి ఎలాంటి స్టేట్‌మెంట్స్ రావు’’ అని తెలిపారు.

Related posts