ప్రస్తుతం సోషల్ మీడియాను ఉపయోగించేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక సినీ తారలు సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ అప్ డేట్ అయినా.. సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఫోటోషూట్స్.. రీల్స్.. లైవ్ చాట్స్ అంటూ రకరకాల పోస్టులతో సందడి చేస్తుంటారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారో తెలిసిందే. ఆయన పెట్టిన ప్రతీపోస్ట్ వైరలే.. తాజాగా చిరు సతీమణి సురేఖ కొణిదెల సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చారు.
ట్విట్టర్ లోకి అడుగు పెట్టిన సురేఖ ఫస్ట్ పోస్ట్ ను స్టైలిష్ గా చేసింది. “సూపర్ స్టైలిష్ కొడుకుతో నా మొదటి పోస్ట్ ట్విట్టర్లో చేరినందుకు సంతోషంగా ఉంది” అంటూ రామ్ చరణ్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది సురేఖ. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Happy To Join On Twitter My First Post With Super Stylish Son @AlwaysRamCharan #RamCharan #RamCharan𓃵 #RRR. pic.twitter.com/BviB9PnvGP
— Surekha Konidala (@SurekhaKonidala) February 26, 2022