అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న మూవీ లవ్ స్టోరీ .. ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘లవ్ స్టోరీ’ మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరిగాయి. ‘ఫిదా’ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల – సాయి పల్లవిల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావటంతో అందరిలోనూ ఆసక్తి బాగానే నెలకొంది. పల్లేటూరు నుంచి సిటీకి ఎదో సాధించడానికి హైదరాబాద్ సిటీకి వచ్చిన ఇద్దరు ప్రేమికుల కథగా ఈ సినిమాను రూపొందించారు.
ఇటీవలే విడుదల చేసిన ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక రిలీజ్కు దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్లో జోరు పెంచారు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించాలని చూస్తున్నారట చిత్రయూనిట్. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నట్టు సమాచారం.
కాగా..చైతన్య లవ్ స్టోరీ సినిమా ప్రీరిలీజ్కు మెగాస్టార్ రావడం అక్కినేని అభిమానుల్లో మరింత జోష్ పెంచింది. స్టేజ్ పై చిరు చైతన్య గురించి ఏం మాట్లాడుతారా అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.