మెగాస్టార్ చిరంజీవి.. సతీమణి సురేఖతో కలిసివెకేషన్ కి వెళుతున్నట్టు తెలిపారు. గత కొంత కాలంగా షూటింగ్ లతో వరుస షూటింగ్లతో బిజీగా ఉన్న చిరు కొద్దిగా బ్రేక్ తీసుకున్నాడు.
ప్రస్తుతం చిరంజీవి 8 సినిమాలను లైన్లో పెట్టాడు.. అందులో మూడు చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ తో పాటు మెహర్ రమేష్ భోళా శంకర్, దర్శకుడు బాబీ దర్శకత్వంలో 154వ చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.
వయసులో ఉన్న హీరోలు రెండేళ్లకు ఓ మూవీ చేస్తుంటే చిరంజీవి ఏక కాలంలో మూడు చిత్రాలు పూర్తి చేస్తున్నారు. ఆచార్య విడుదల తర్వాత ఆయన కాస్త బ్రేక్ ఇచ్చాడు.
చాలా రోజుల తర్వాత చిన్న హాలీడే తీసుకొని సురేఖతో కలిసి అమెరికా, యూరప్ పర్యటనకు వెళ్తున్నాం. త్వరలోనే అందరిని కలుస్తా’ అంటూ సురేఖతో ఫ్లైట్లో దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
చిరంజీవి పోస్ట్పై ఆయన కూతురు శ్రీజతో పాటు కోడలు ఊపాసన కూడా స్పందించారు. ‘ఎంజాయ్ అమ్మ అండ్ డాడీ, ఐలవ్ యూ సో మచ్’అని శ్రీజ, ‘హ్యాపీ టైమ్ అత్తయ్య, మామయ్య’ అని ఉపాసన కామెంట్ చేశారు.