ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేయడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.ఈసందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా నిర్ణయం తీసుకున్నారని, థియేటర్ల మనుగడను, ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలన్న సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమా టికెట్ల ధరలు సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు థాంక్స్ చెప్పారు.
ముఖ్యంగా చిన్న సినిమాలకు ఐదవ షో వేసుకునే అవకాశం ఇవ్వడం చాలాబాగుందని తెలిపారు. ఈ నిర్ణయం చిన్న నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుస్తుందని తెలిపారు.
ఇక ఇదే ట్వీట్లో .. సంబంధిత మంత్రివర్యులు… సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానీకి, అధికారులకు, కమిటీకి ధన్యవాదాలు ” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
Thank you Sri. @ysjagan garu @AndhraPradeshCM pic.twitter.com/BsvmsEPrxt
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 7, 2022