దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు వరుసగా కోవిడ్ బారిన పడుతున్నారు.
ముఖ్యంగా సెలబ్రెటీలు, పొలిటికల్ సర్కిల్స్ లోనూ ప్రముఖులు ఈ సారి కరోనా బారిన పెద్ద సంఖ్యలో పడుతున్నారు.. తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ పలువురు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే మహేశ్బాబు, మంచు మనోజ్తో పాటు పలువురు హీరోలు కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా చిరంజీవి రెండో సారి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్గా తేలిందని చెప్పారు. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బుధవారం ట్వీట్ చేశారు. ‘‘అన్నిరకాల జాగ్రత్తలు పాటించినప్పటికీ నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నానని రాసుకొచ్చారు.
కాబట్టి గత కొన్నిరోజుల నుంచి నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నా. త్వరలోనే మీ అందరి ముందుకు పూర్తి ఆరోగ్యంతో తిరిగివస్తాను’’ అని చిరంజీవి తెలిపారు. ఆయన ట్వీట్తో అభిమానులందరూ ఆందోళనకు గురవుతున్నారు. చిరు వేగంగా కోలుకోవాలని కోరుకుంటూ వరుస ట్వీట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 1న థియేటర్లలోకి రానుంది. దీనితోపాటే గాడ్ఫాదర్, భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ నటిస్తారు.