80వ దశకం నాటి స్టార్స్ అందరు ప్రతి ఏడాది “క్లాస్ ఆఫ్ ఎయిటీస్” పేరుతో వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈసారి పదో వార్షికోత్సవం కావడంతో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. చిరంజీవి, రజనీకాంత్, మోహన్లాల్, వెంకటేశ్, భాను చందర్, నరేశ్, సురేశ్, జయసుధ, రాధిక, నదియా, రమ్యకృష్ణ, శోభన, సుహాసిని, రేవతి, సుమలత, రాధ, లిజి, పూర్ణిమ, భాగ్యరాజ్, జాకీష్రాఫ్, రెహమాన్, ప్రభు, శరత్కుమార్ ఇతర తారలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవల ఈ వేడుకలో నటీనటులు దిగిన ఫోటోలు కొన్ని బయటకి రాగా, తాజాగా చిరు, ఖుష్బూ, జయప్రద కలిసి స్టెప్పులేసిన వీడియో ఒకటి బయటకి వచ్చింది. 1992లో చిరు నటించిన చిత్రం ఘరానా మొగుడు. ఇందులో బంగారు కోడిపెట్ట సాంగ్ ఓ ఊపు ఊపింది. అందుకేనేమో ఈ సాంగ్ని చరణ్ తన చిత్రం మగధీర కోసం రీమేక్ చేశారు. ఇప్పుడు ఈ పాటకి చిరు, ఖుష్బూ, జయప్రద అదిరిపోయే స్టెప్పులేశారు. ఆరు పదుల వయస్సులోను చిరు అంతే గ్రేస్తో డ్యాన్స్ చేస్తుండడం చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
previous post
ఫ్రీ భోజనం కోసమే ప్రెస్ మీట్లకు..జర్నలిస్టులపై కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు