దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను వీక్షించి తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఇక తాజాగా మెగా ఫ్యామిలీ ఆర్ఆర్ఆర్ సినిమాను వీక్షించింది. ఏఎంబి మాల్ లో మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, ఆయన తల్లి అంజనీ దేవితో సహా ఈ సినిమాను వీక్షించారు.
ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మెగాస్టార్ డాటర్ సుష్మిత మాట్లాడుతూ..ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తుంటే సంతోషముతో కడుపు నిండిపోయిందని చెర్రీ అక్క సుష్మిత అన్నారు. సినిమా చూస్తున్నంత సేపు.. చరణ్, తారక్ లు నిజంగా అన్నదమ్ములేమో అనిపించిందని.. నిజమైన అన్నదమ్ముల్లా ఉన్నారని చెప్పారు. ఇక డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా ఏమీ చెప్పినా తక్కువే అంటూ తమ్ముడిపై, తారాకపై అభిమానాన్ని చాటుకుంది.
తనకు సినిమా క్లైమాక్స్ లో ఫైర్లో ఇద్దరూ కలిసి రావడం అద్భుతమైన సీన్ అనిపించిందని.. ఆ సన్నివేశం తనకు బాగా నచ్చిందని సుష్మిత వెల్లడించారు.
ఇది నెక్ట్స్ లెవల్ సినిమా… ‘ఆర్ఆర్ఆర్”పై సాయిమాధవ్ బుర్రా