telugu navyamedia
రాజకీయ వార్తలు

కుమారస్వామికే ఓటేయాలని బీఎస్పీ ఎమ్మెల్యేకు సూచించిన మాయావతి!

Mayawati Welcomes Reservation To Upper Castes

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోబోతున్ననేపథ్యంలో బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా తమ ఎమ్మెల్యే ఓటు వేస్తారని ట్వీట్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు ఆదేశాలిచ్చినట్టు తెలిపారు.మాయావతి ట్వీట్‌కు ముుందే బీఎస్పీ ఏకైక ఎమ్మెల్యే మహేశ్ మాట్లాడుతూ.. అధినేత్రి మాయావతి సూచన మేరకు నేటి బలపరీక్షకు హాజరుకాబోనని నిన్న స్పష్టం చేశారు.

ఆ ప్రకటన తర్వాత కాసేపటికే మాయావతి ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీకి హాజరై తమ ఎమ్మెల్యే కుమారస్వామికి అనుకూలంగా ఓటు వేస్తారని మాయావతి ప్రకటించారు. గత నెల రోజులుగా జరుగుతున్న కర్ణాటక హై డ్రామాకు నేటితో తెరపడే అవకాశం ఉంది. రెబల్ ఎమ్మెల్యేలు పట్టువీడకపోవడంతో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Related posts