telugu navyamedia
రాజకీయ వార్తలు

మాస్కు ధ‌రించ‌నివారిపై కొర‌డా.. ల‌క్ష జ‌రిమానా, రెండేళ్ల జైలుశిక్ష‌

masks corona

క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో మాస్క్ ధ‌రించ‌డం తప్పనిసరిగా మారింది. వైరస్ ను కట్టడి చేసేందుకు మాస్క్ ఎంతగానో ఉపయోగపడుతోంది. దీంతో కొన్ని ప్ర‌భుత్వాలు.. మాస్క్ ధ‌రించ‌నివారిపై భారీ జరిమానాలు వేస్తున్నాయి. జార్ఖండ్ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం కూడా మాస్క్ ధ‌రించ‌నివారిపై కొర‌డా రుళుపించింది. అలాంటి వారిపై భారీ జ‌రిమానాలు వ‌సూల్ చేయ‌నున్న‌ట్లు ప్రకటించింది.

లాక్‌డౌన్ నిబంధ‌న‌ల్లో భాగంగా ముఖానికి మాస్క్ లేకుండా బ‌య‌ట‌కు వెళ్తే ల‌క్ష రూపాయాలు జ‌రిమానా వసూల్ చేయ‌నున్న‌ట్లు ఆ ప్ర‌భుత్వం ఇవాళ ప్ర‌క‌టించింది. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారికి అద‌నంగా రెండేళ్ల జైలుశిక్ష‌ను కూడా అమ‌లు చేయ‌నున్నారు.

Related posts