పవర్స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, తలసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ –‘‘నాలుగేళ్ల క్రితం ఇదే గ్రౌండ్కి చరణ్ చిత్రం కోసం వచ్చినప్పుడు ‘తండ్రేమో మెగాస్టార్.. బాబాయ్ పవర్స్టార్’ అని మీ (పవన్ కల్యాణ్) పేరు చెప్పినపుడు నన్ను అభిమానులు మట్లాడనివ్వలేదు.
పవన్ మంచి మనిషి, విలక్షణమైనౖ శైలితో పాటు కల్ట్ ఫాలోయింగ్ ఉన్న సూపర్స్టార్ పవన్ కల్యాణ్. మేమందరం కాలేజీ రోజుల్లో మీ ‘తొలిప్రేమ’ చూసినవాళ్లమే. అప్పటినుండి ఇప్పటివరకూ 25 ఏళ్ల పాటు ఒకే రకమైన స్టార్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడం అసాధరణమైన విషయం.
నల్గొండ నుండి వచ్చి ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సాగర్ కే చంద్ర మరిన్ని విజయాలు సాధించాలి. ఈ చిత్రం ద్వారా చాలా మంది అజ్ఞాతసూరీడులను అందించిన చిత్రబృందానికి అభినందనలు. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తోన్న మల్టీస్టారర్ చిత్రం ‘భీమ్లానాయక్’. నిత్యామేనన్, సంయుక్తా మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కే. చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోండగా త్రివిక్రమ్, స్క్రీన్ప్లే, సంభాషణలు అందించారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. రేపు (ఫిబ్రవరి 25) ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఆ సినిమా వలన అప్పులపాలయ్యా