ఈ మధ్య కాలంలో ప్రేమికుల సూసైడ్ ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమించానని వెంటపడటం.. కలకాలం చూసుకుంటానని నమ్మించడం.. జీవితాంతం తోడుంటానని చెప్పి పెళ్లి చేసుకోన్న కానీ కొన్ని రోజులకే వేధించడం మీడియాలో చూస్తుంటాం. అదే తరహాలోనే ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఓ ప్రేమజంట కథ మూడునాళ్ళ ముచ్చటైంది.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సా గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ అదే గ్రామానికి చెందిన వెన్నెలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ పెళ్లికి కిరణ్ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఉన్న ఊరు వదిలి చెన్నూర్ లో ఓ అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు.
అయితే రోజు రోజుకు భర్త కిరణ్ కుమార్ వేదింపులు ఎక్కువకావడం , కులంపేరుతో సూటిపోటి మాటలనడంతో ఆమె భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అమ్మనాన్న క్షమించండి.. మళ్లీ జన్మంటూ ఉంటే మన కులంలోనే పుడుతానంటూ సూసైడ్ నోట్ రాసి పురుగులు మందు తాగింది. రెండో రోజులుగా ఆస్పత్రిలో నరకయాతన అనుభవించి చివరికి కన్ను మూసింది. చివరి క్షణాల్లో రాసిన మరణలేఖ ఇప్పుడు జిల్లాలో అందరిని కంటతడిపెట్టిస్తోంది.
అయితే కొన్ని నెలలు గడిచాక అత్తమామలు కొడుకును ఇంటికి రావాలంటూ కోరారు. అత్తమామల పిలుపుతో సంబరపడిపోయిన వెన్నెల మెట్టినింటి గడప తొక్కింది. అప్పటి వరకు ఏ బాధ లెకుండా సాగిన కాపురం.. ఒక్కసారి తారుమారైంది. నా కొడుకును బుట్టలో వేసుకుని కట్నం రాకుండా చేశావంటూ అత్తమామ వేధింపులు మొదలయ్యాయి. ఇద్దరికులాలు వేరు కావడంతో ఆ వేధింపులు మరింత పెరిగాయి.
తన బాధను ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక వెన్నెల మూడు పేజీల లేఖ రాసి 30 తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై వెన్నెల తల్లిదండ్రుల పిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసునమోదు చేసినట్లు ఆ జిల్లా పోలీసులు తెలిపారు.