telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అంబులెన్స్ రాక ఆలస్యంతో సినీనటి, ఆమె శిశువు మృతి

Marati

అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో ప్రసవానంతరం ప్రముఖ మరాఠీ నటి మరణించిన విషాద ఘటన మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో వెలుగుచూసింది. ముంబై నగరానికి 590 కిలోమీటర్ల దూరంలోని మరాట్వాడలోని హింగోలి జిల్లాకు చెందిన పూజా జుంజార్ (25) మరాఠీ సినిమానటి. గర్భం దాల్చిన పూజా జుంజార్ పురిటినొప్పులతో ఉండగా ప్రసవం కోసం ఆమెను తెల్లవారుజామున రెండు గంటలకు గోరేగాంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. పూజా ఓ శిశువుకు జన్మనిచ్చింది. జన్మించిన కొద్దిసేపటికే శిశువు మరణించింది. పూజా జుంజార్ పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో ఆమెను హింగోలీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని ప్రాథమిక వైద్యకేంద్రం వైద్యులు సూచించారు. గోరేగాం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హింగోలికి తరలించేందుకు సకాలంలో అంబులెన్స్ దొరకలేదు. పూజా బంధువులు ఎలాగోలా ఆలస్యంగానైనా ఓ ప్రైవేటు అంబులెన్స్ తీసుకువచ్చి అందులో ఆమెను హింగోలికి తీసుకువెళుతుండగా మార్గమధ్యంలోనే మరణించింది. అంబులెన్స్ సకాలంలో లభించనందు వల్లే వైద్యం అందక మరాఠీ సినీనటి పూజా జుంజార్ మరణించడంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. రెండు మరాఠీ చిత్రాల్లో నటించిన పూజా గర్భం దాల్చడంతో కొంత విరామం తీసుకున్నారు. ప్రసవంలో పూజాతోపాటు శిశువు కూడా మరణించడం విషాదాన్ని నింపింది.

Related posts