మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోలు తమ ఉనికిని చాటుకునేందుకు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతోమన్యంలో భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టు యాక్షన్ టీములు కూడా సంచరిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగారు.
సరిహద్దు ప్రాంతాల రాకపోకలపై ప్రత్యేక నిఘా పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో కార్డన్సెర్చ్ నిర్వహించారు. అరకు, పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టులలో సోదాలు నిర్వహించారు. ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా గాలించారు. పోలీసులు గ్రామాల్లో చేపట్టిన తనిఖీలతో మన్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడేమీ జరుగుతోందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
గవర్నర్తో అబద్దాలు చెప్పించారు: రాజాసింగ్