బుద్ధభగవానుడి జన్మదినోత్సవమైన బుద్ధపూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్రమోదీ తమతమ సోషల్ మీడియా ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశంలో సామాజిక శాంతి కోసం, దేశ అభివృద్ధి కోసం ప్రజలు బుద్ధుడి బోధనలను అనుసరించాలని రాష్ట్రపతి ముర్ము కోరారు. బుద్ధుడు తన బోధనల్లో సత్యం, అహింస, ప్రేమ, మానవత్వం గురించి చెప్పారని ఆమె గుర్తుచేశారు.
సమాజ అభివృద్ధి, శాంతి సామరస్యాల కోసం ప్రతి ఒక్కరూ బుద్ధుడు బోధించిన విలువలను పాటించాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రధాని నరేంద్రమోదీ కూడా అందరూ బుద్ధ భగవానుడు బోధించిన విలువలను తూచతప్పకుండా పాటించాలని కోరారు.
సమాజ శాంతి, సోదరభావం కోసం పాటుపడితేనే ఆ బుద్ధభగవానుడి ఆశీస్సులు మనందరిపై ఉంటాయని పేర్కొన్నారు.