telugu navyamedia
రాజకీయ వార్తలు

విదేశీ పెట్టుబడులు దేశాన్ని కాపాడలేవు: మన్మోహన్ సింగ్

Congress manmohan

భారత ఆర్థిక వ్యవస్థపై మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశం ప్రస్తుతం ఆర్థిక మందగమనం, సామాజిక అసమానత, కోవిడ్-19 సమస్యలతో బాధపడుతోందని ఓ ఆంగ్ల పత్రికకు రాసిన కథనంలో పేర్కొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి పునాదిలాంటి సామాజిక సామరస్యం ప్రమాదంలో పడినప్పుడు పన్ను రేట్ల తగ్గింపు, కార్పొరేట్ రాయితీలు, విదేశీ పెట్టుబడులు దేశాన్ని కాపాడలేవని అభిప్రాయపడ్డారు. రాజకీయ వర్గాలతోపాటు సమాజంలోని కొందరు మతపరమైన అల్లర్లకు కారణమయ్యారని ఢిల్లీ హింసను పరోక్షంగా ప్రస్తావించారు.

శాంతిభద్రతలను కాపాడాల్సిన సంస్థలతోపాటు, మీడియా కూడా ఈ విషయంలో విఫలమైందన్నారు. మందగమనంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ పూర్తిస్థాయిలో ప్రభావం చూపకముందే తగిన చర్యలు తీసుకోవాలని మన్మోహన్ కోరారు.దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు తొలుత అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించి కరోనాను సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు.

Related posts