టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “మన్మథుడు-2”. ఈ చిత్రంలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అక్కినేని కోడలు సమంత, హీరోయిన్ కీర్తీ సురేష్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆగస్టు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మేరకు నాగార్జున ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తాజాగా చిత్ర యూనిట్ మరో కొత్త పోస్టర్ను విడుదల చేసింది. పోస్టర్లో నాగ్ చిరాకుగా ఉంటే.. ఒకవైపు రకుల్, లక్ష్మి, మరోవైపు ఝాన్సీ తదితరులు నాగ్ ను చూసి నవ్వుకుంటున్నారు. ఈ పోస్టర్ను నాగ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసి `ఆగస్టు 9వ తేదీన వస్తున్నాం. అప్పట్నుంచి నవ్వులు ప్రారంభమవుతాయి` అని ట్వీట్ చేశారు.
previous post
next post