telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

షరీఫ్ ను దూషించిన మంత్రులపై ఫిర్యాదు

sharif mandali chairman

శాసనమండలి చైర్మన్‌ మహ్మద్‌ షరీఫ్ ను దూషించిన మంత్రులపై ముస్లిం నాయకులు ఫిర్యాదు చేశారు. మతం పేరుతో దూషించిన మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, అనిల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ జియావుద్దీన్‌కు ముస్లిం నాయకులు ఫిర్యాదు చేశారు.

మైనారిటీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎండీ హిదాయత్‌, మైనారిటీ నాయకులు లాల్‌వజీర్‌, షేక్‌ మీరావలి గుంటూరులో కమిషన్‌ చైర్మన్‌ జియావుద్దీన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హిదాయత్‌ మాట్లాడుతూ, రాజ్యాంగం రీత్యా తనకు సంక్రమించిన విచక్షణాధికారంతో మండలి చైర్మన్‌ షరీఫ్‌ వికేంద్రీకరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించారని, ఈ క్రమంలో మంత్రులు ఆయనను మతం పేరుతో దూషించి, దాడికి యత్నించారని తెలిపారు.

Related posts