తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణలో మాదిగలకు చోటు కల్పించకపోవడం చూస్తేంటే మాదిగల అణిచివేత కుట్ర స్పష్టం అవుతుందని ఎమ్మార్పీస్ వ్యవస్థాక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. పరకాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1 శాతం వెలమలకు 4 మంత్రి పదవులు, 4 శాతం ఉన్న రెడ్డిలకు 6 మంత్రి పదవులు, 12 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్క మంత్రి పదవి ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
మాదిగల అంతు చూడాలని చూస్తే సీఎం కేసీఆర్ అంతు చూస్తామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిహెచ్చరించారు. హన్మకొండలోని కేడీసీ మైదానంలో ఈ నెల 22న చేపట్టబోయే మహా దీక్షతో యావత్తు ప్రపంచానికి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని చూపిస్తామన్నారు. కార్యక్రమంలో మాదిగ యువసేన రాష్ట్ర కన్వీనర్ పుట్ట భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.