telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మాదిగల అణిచివేతకు కుట్ర: మంద కృష్ణ

MRPS manda krishna comments Chandrababu

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మంత్రి వర్గ విస్తరణలో మాదిగలకు చోటు కల్పించకపోవడం చూస్తేంటే మాదిగల అణిచివేత కుట్ర స్పష్టం అవుతుందని ఎమ్మార్పీస్ వ్యవస్థాక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. పరకాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1 శాతం వెలమలకు 4 మంత్రి పదవులు, 4 శాతం ఉన్న రెడ్డిలకు 6 మంత్రి పదవులు, 12 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్క మంత్రి పదవి ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

మాదిగల అంతు చూడాలని చూస్తే సీఎం కేసీఆర్‌ అంతు చూస్తామని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితిహెచ్చరించారు. హన్మకొండలోని కేడీసీ మైదానంలో ఈ నెల 22న చేపట్టబోయే మహా దీక్షతో యావత్తు ప్రపంచానికి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని చూపిస్తామన్నారు. కార్యక్రమంలో మాదిగ యువసేన రాష్ట్ర కన్వీనర్‌ పుట్ట భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Related posts