telugu navyamedia
సినిమా వార్తలు

ప్రకాశ్‌రాజ్‌కి బీపీ మాత్ర ఇవ్వండి..

టాలీవుడ్‏లో విమర్శలు, ఆరోపణలతో మూవీ ఆరిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అక్టోబర్ 10న మా అధ్యక్ష పదవి ఎన్నికలు జరగనుండడంతో బరిలో ఉన్న అభ్యర్థులు హోరా హోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.

‘మా’ ఎన్నికల్లో తన కుటుంబాన్ని తీసుకురావద్దని, ‘మంచు ఫ్యామిలీ’ అంటూ మాట్లాడితే ఊరుకునేది లేదని, తన తండ్రి పేరును తీయొద్దని మంచు విష్ణు.. ప్రకాశ్‌రాజ్‌ను హెచ్చరించారు. ఉదయం ప్రకాశ్‌రాజ్‌ చెప్పిన ప్రతి అంశానికీ మీడియా ముందు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. 

కుటుంబంలో జరిగే ఎన్నికల్లో ప్రతి విషయాన్ని తీసుకొచ్చి, ప్రకాశ్‌రాజ్‌ మీడియా ముందు పెడుతున్నారని, ప్రతి దానికీ తీవ్రంగా స్పందిస్తున్నారని మా అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు ఆరోపించారు ప్రకాష్ రాజ్‏కి బీపీ టాబ్లెట్ ఇవ్వాలని. ఆయన అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారు. మీడియా ముందు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రియల్ లైఫ్‌లోనూ ఆయన బాగా నటిస్తున్నారు. నేరాలు-ఘోరాలు జరిగిపోతున్నాయని అంటున్నారు.

ప్రకాశ్ రాజ్ మగాడైతే, దమ్ముంటే నన్ను ఎదుర్కోవాలి... ఇంకోసారి నా కుటుంబం పేరు ఎత్తితే బాగుండదు!: మంచు విష్ణు | ap7am

ఆయనకు పగ-ద్వేషాలు ఎందుకో నాకు తెలియడం లేదు. ఎన్నికల సంఘం వద్దకు వచ్చి పరిష్కరించుకుంటే అయిపోయేది. ఈవీఎంలు వద్దని ‘మా’కు లేఖ రాశా. ఎందుకంటే గత ఎన్నికల్లోనూ పేపర్‌ బ్యాలెట్‌ వాడారు. ఇవి అయితే, ఎన్నిసార్లు అయినా లెక్కపెట్టుకోవచ్చు. ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉంది” అని మంచు విష్ణు అన్నారు.

“మా’లో 60 ఏళ్లు పైబడిన వారు 180 మందికి పైగా ఉన్నారు. చాలామంది పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేస్తామని అన్నారు. కొందరు పెద్దలు పోస్టల్ బ్యాలెట్‌ కావాలని అడిగారు. పెద్దా, చిన్నా చూడకుండా ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతున్నారు. రియల్ లైఫ్‌లోనూ ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నారు. ఈవీఎంల ద్వారా ఓటింగ్ వద్దని ‘మా’కు లేఖ రాశా. ‘మా’ ప్యానెల్ సభ్యులు పేపర్ బ్యాలెట్‌కు వెళ్దామన్నారు. పేపర్ బ్యాలెట్‌ను పలుసార్లు లెక్కించేందుకు అవకాశం ఉంది. ‘మా’ లో 160 కిపైగా 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. వారిలో 100 మంది నేరుగా వచ్చి ఓటు వేస్తామన్నారు.

MAA Elections 2021: Manchu Vishnu Serious On Prakash Raj - Sakshi

పరుచూరి బ్రదర్స్ లాంటి వాళ్లు పోస్టల్ బ్యాలెట్ వైపే ఆసక్తి చూపారు. పోస్టల్ బ్యాలెట్ కోసం నేనే ఒక లెటర్ తయారుచేశా. పోస్టల్ బ్యాలెట్ కోసం రూ.500 కట్టమని ఎన్నికల అధికారి మెసేజ్ చేశారు. నేను 400 ఓట్ల మెజార్టీతో లేదా ఒక్క ఓటు మెజార్టీతో గెలవచ్చు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో అన్ని లీగల్ గానే జరిగాయి. చెన్నైలో ఉన్న శరత్ బాబుకు నేనూ ఫోన్ చేశా. చెన్నైలో ఉండగా మా నాన్నగారు శరత్ బాబు రూమ్ మేట్స్. కృష్ణగారిని అవమానిస్తారా? పెద్దలను గౌరవించకపోతే సర్వనాశనం అవుతారు. పరిచూరి బ్రదర్స్ వాళ్ల డబ్బు వాళ్లే కట్టుకున్నారు.”

జీవిత గారు మీరు మా నాన్న గారి పేరు తీస్తే నేను తీస్తా. బజారు కు ఇడుస్తా అంటూ హెచ్చరించారు మంచు విష్ణు.జీవిత ఎలా గెలుస్తారు అని అంటున్నారు మమల్ని.. మాట్లాడితే అర్థం ఉండాలి. ఓట్లు వేయొద్దు అని రావొద్దు అని ఎలా చెప్తారు జీవిత. నాలుగు రోజుల ముందు రాజశేఖర్ వొచ్చి మా నాన్న గారిని కలిశారు. ఎం మాట్లాడారు..మీరే చెప్పాలి.

Related posts