telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిన్ను ఎప్పటికీ మరచిపోలేను : మంచు విష్ణు

Manchu-Vishnu

తాజాగా యంగ్ హీరో మంచు విష్ణు తన ‘ఢీ’ మూవీ సంగతులను గుర్తుచేసుకున్నారు. 2007 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన విడుదలైంది ఢీ మూవీ. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో మంచు విష్ణు, జెనీలియా జంటగా నటించారు. అప్పట్లో టాలీవుడ్‌లో సంచలన విజయం నమోదు చేసింది ‘ఢీ’ మూవీ. అయితే ఈ సినిమా విడుదలై 13 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ డైరెక్టర్ శ్రీను వైట్లను ‘ఢీ2’ ఎప్పుడు? అని ప్రశ్నించారు మంచు విష్ణు. ఈ సినిమా విడుదల కావడానికి కారణం నాన్న మోహన్ బాబు అని తెలిపిన మంచు విష్ణు.. ఆ రోజు చిత్రయూనిట్ అందరి ముఖాల్లో ఆనంద భాష్పాలు చూశానని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన జెనీలియా ‘నేను కూడా అక్కడ ఉన్నట్టు నీకు గుర్తుందా’ అని ప్రశ్నించింది. ఆమె ప్రశ్నకు బదులిచ్చిన మంచు విష్ణు.. ”ఈ ఫొటో చూశావా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ నిన్ను మరచిపోలేను” అని పేర్కొన్నారు.

Related posts