మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో సభ్యలు మధ్య పోటీ మరింత బలపడింది. ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.. ఈసారి అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగగా.. మంచు విష్ణు మరో ప్యానెల్ తరపున పోటీలో దిగుతున్నట్లుగా ప్రకటించారు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు ఈసారి ప్రకాష్ రాజ్ ప్యానెల్కు సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ప్రకాశ్రాజ్కి పోటీగా మంచు విష్ణు బరిలోకి దిగనుండటం.. ‘మా’ ఎన్నికలపై ఆసక్తి రెట్టింపయ్యింది.
అయితే తాజాగా ‘మా’ కల త్వరలో నెరవేరనుందని, మా ఫ్యామిలీ వారందరికీ గుడ్ మార్నింగ్ అంటూ కారు నడుపుతూ..ఆయన మాట్లాడిన ఓ విడియో ట్విటర్లో షేర్ చేశారు. ‘మా’కి శాశ్వత భవనం ఉండాలనేది అసోసియేషన్లో ఉన్న సభ్యులందరి కల అని..త్వరలోనే ఆ కల నెరవేరబోతోందని వెల్లడించారు. స్వయంగా తాను మూడు స్థలాలను చూడడం జరిగిందన్నారు. తాను చూసిన స్థలాల్లో ఏది బెస్ట్ అనే దానిపై కూర్చొని మాట్లాడుకుని డిసైడ్ చేద్దామన్నారు. ఈ గుడ్ న్యూస్ మీతో చెప్పాలని అనే ఈ వీడియో పోస్టు చేయడం జరిగిందన్నారు.
తెలుగు చిత్రపరిశ్రమలో మా ఎన్నికలు ”ఎన్నడూ లేని విధంగా ఐదుగురు సభ్యులు ఈ ఏడాది అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నారు. ప్రకాశ్రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, నరసింహారావు ఇలా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ‘మా’కు శాశ్వత భవనం నిర్మించడం
కాగా మా ఎన్నికల్లో ప్రధాన అంశం సొంత భవన నిర్మాణం అజెండాగా నటుల మధ్య పోటీ మొదలవుతోంది. ్ మంచు విష్ణు షేర్ చేసిన వీడియోతో అందరి దృష్టి మరోసారి ‘మా’ ఎన్నికలపై పడింది.