telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాస్టర్డ్స్‌ని ఎవడినీ వదలకూడదు… దిశ తల్లిదండ్రుల్ని పరామర్శించిన మంచు మనోజ్

Manchu-Manoj

హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ అమ్మాయిని ఇంత క్రూరంగా హత్యచేయడంపై యావత్తు భారతావని భగ్గుమంది. ఆ మగ మృగాలను నడిరోడ్డుపై ఉరితీయాలని నినదించింది. కూతురిని కోల్పోయి దు:ఖంలో ఉన్న దిశ తల్లిదండ్రులను సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సినీ హీరో మంచు మనోజ్ వారిని పరామర్శించారు. దిశ చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. అనంతరం కాసేపు ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. వాళ్లకు ధైర్యం చెప్పారు. దోషులకు శిక్షపడేవరకు ఈ పోరాటం వెనుక తాను కూడా ఉంటానని హామీ ఇచ్చారు. “ఆడపిల్లలను గౌరవించండి అని నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. ఈరోజు దిశకు జరిగిందే కాదు.. నిర్భయ విషయంలో, ఆ మధ్య తొమ్మిది నెలల పసిబిడ్డను.. ఇలా రేప్‌లు చేసుకుంటూ పోతే సమాజం ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు. ఇలాంటి సమాజంలోనా మనం ఉంటున్నాం, తిరుగుతున్నాం అని నాకు నేను ఎప్పుడూ ప్రశ్నించుకుంటూనే ఉంటాను. వాళ్లింట్లో వాళ్లకు ఎందుకు ఫోన్ చేశారు.. పోలీసులు ఫోన్ చేయొచ్చుగా అని ఒకడు, ఆ టైంలో బయట ఎందుకు తిరుగుతున్నారని ఒకడు మాట్లాడుతున్నారు. అంటే మన ఆడపిల్లలు బయటికి రాకూడదా? రాత్రిళ్లు తిరగకూడదా? మనం ఆ సెక్యూరిటీ ఇవ్వలేమా?’’ అని ప్రశ్నించారు మనోజ్. బయటికొచ్చి ఎందుకు ఆందోళన చేయట్లేదు, వాళ్లను చంపేద్దాం నరికేద్దాం అని చాలా మంది అంటున్నారు, ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఏమీ చేయలేము. గీత దాటితే ట్రాఫిక్ పోలీసులు రూ.1000 చలాన్ వేస్తున్నారని, మందు తాగి డ్రైవింగ్ చేస్తే స్పెషల్ డ్రైవ్‌లు పెట్టి పట్టుకుంటున్నారని ఉచ్చ పోసుకున్నాం. తప్పించుకుని తిరిగాం. అలాంటిది ఆడపిల్ల జోలికి వస్తే ఎంత రిస్క్ ఉంటుందో తెలిసేలా అవేర్‌నెస్ తీసుకురావాలి. తాగేసొచ్చి భార్యల్ని కొట్టేవాళ్లకు, సొంత అమ్మల్ని, పిల్లల్ని తిట్టేవాళ్లకు ఒక రిక్వెస్.. ఈరోజు మీరు తాగేసి ఇళ్లలో అలా చేస్తుంటే మీ పిల్లలు అది చూస్తారు. ఓ మా నాన్న అమ్మను కొడుతున్నాడే వెరీ గుడ్.. రేపు నేను బయటికి వెళ్లి కొడితే ఇలాగే పడుంటారు కదా అనే భావన ఇళ్లలోనే క్రియేట్ చేసి పంపిస్తున్నాం. అది ఇళ్లలోనే దయచేసి ఆపండి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మనోజ్. దేవుడి చేతుల్లో బోలెడన్ని ఆయుధాలు ఉంటాయని, మనల్ని కాపాడతాడనే దేవుడుకి అన్ని ఆయుధాలు ఇచ్చామని మనోజ్ చెప్పారు. అయితే, అవే ఆయుధాలను మనం పోలీసులకు ఇచ్చామని, వాళ్లు మనల్ని కాపాడతారనే ధైర్యంతో మన ఆడపిల్లలు రోడ్లపై తిరుగుతున్నారని, అలాంటి ఆ రోజు ఎందుకు నిర్లక్ష్యం జరిగిందో ఆ దేవుడుకే తెలుసు అని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts