telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పేదలకు మంచు మనోజ్ సాయం… 

Manchu-Manoj

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, భోజనం చేసే ముందు చేతులు సబ్బు లేదా హ్యాండ్ వాష్‌తో శుభ్రంగా కడుక్కోవాలని, ఆల్కహాలిక్ శానిటైజర్లు వాడాలని, ముఖానికి మాస్క్‌లు ధరించాలని ప్రజలను చైతన్యం చేస్తూ ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. అయితే, ప్రస్తుతం బయట హ్యాండ్ శానిటైజర్ల కొరత ఏర్పడింది. నిజానికి పేద ప్రజలు ఈ శానిటైజర్లను కొనుగోలు చేసుకోలేని పరిస్థితి. అందుకే వారి కోసం మంచు మనోజ్ మరో ముందడుగు వేశారు. మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మాస్క్‌లు, శానిటైజర్లను కొనుగోలు చేసుకునే స్తోమతలేని వారికి, అసలు వీటిపై సరైన అవగాహన లేనివారికి తన వంతు సాయంగా వాటిని పంపిణీ చేస్తున్నానని మనోజ్ పేర్కొన్నారు. అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని భద్రతగా ఉండాలని రిక్వెస్ట్ చేశారు. మంచు మనోజ్ చేస్తోన్న ఈ మంచి పనికి ప్రశంసలు అందుతున్నాయి. ట్విట్టర్‌లో చాలా మంది ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మంచి పనులు చేయడంలో మంచు మనోజ్ ఎప్పుడూ ముందుంటారని కొనియాడుతున్నారు. ఇలాగే మరిన్ని మంచి పనులు చేపట్టాలని ఆశీర్వదిస్తున్నారు. ప్రస్తుతం మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాలో నటిస్తున్నారు.మనోజ్ సరసన ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ఆయనే నిర్మాత. సొంతంగా ఎంఎం ఆర్ట్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి ఈ బ్యానర్‌లో మొదటి సినిమాగా ‘అహ్మం బ్రహ్మాస్మి’ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.

Related posts