telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మిమ్మల్ని మిస్ అవుతున్నా సినీ అమ్మా… సౌందర్యను గుర్తు చేసుకున్న మంచు మనోజ్

Soundarya

ఈ రోజు (శనివారం) నటి సౌందర్య జయంతి. ఈ సందర్భంగా మంచు హీరో మనోజ్ సోషల్ మీడియా ద్వారా సౌందర్యకు నివాళులర్పించాడు. `సౌందర్యగారి జయంతి సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటున్నాను. మీరు అద్భుతమైన నటి, గొప్ప వ్యక్తిత్వం గల మనిషి. మిమ్మల్ని మిస్ అవుతున్నా సినీ అమ్మా. మీరు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాల`ని మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. మహానటి సావిత్రి తర్వాత తెలుగు వారిని బాగా ఆకట్టుకున్న హీరోయిన్ సౌందర్య. సౌత్ లో దాదాపు అగ్ర హీరోలందరి సరసనా నటించి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. అయితే సౌందర్య 2004లో ఓ విమాన ప్రమాదంలో మరణించారు. ఇక మంచు మనోజ్ సొంతంగా ఎంఎం ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’ని నిర్మిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ‘అహం బ్రహ్మాస్మి’ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.

Related posts