telugu navyamedia
సినిమా వార్తలు

ఏపీ సీఎం జగన్‌ని కలిసిన మంచు మనోజ్

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్ అమరావతిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన ఆశాజనకమైన ప్రణాళికలకు తాను సపోర్ట్ చేస్తున్నాను అని మనోజ్ చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌లో మంచు మనోజ్ తాను ముఖ్యమంత్రితో ఉన్న ఫొటోను పోస్ట్ చేసారు. “దూరదృష్టి గల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారిని కలవడం గౌరవంగా భావిస్తున్నాను.

రాష్ట్రం కోసం ఆయన చేస్తున్న కొన్ని గొప్ప ఆలోచనల గురించి చర్చించాము. సమీప భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న అద్భుతమైన ప్రణాళికలను విన్నాను. అవి అద్భుతంగా, ఆశాజనకంగా ఉన్నాయి. జగన్ సార్ మీ విజన్ సాధించడానికి దేవుడు మీకు బలం, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. మీ పరిపాలనకు శుభాకాంక్షలు” అని మనోజ్ ట్వీట్ చేశాడు.

Related posts