telugu navyamedia
సినిమా వార్తలు

రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డెక్కలేదు : మంచు మనోజ్

Manchu Manoj

శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించట్లేదని నిన్న ప్రముఖ సీనియర్ నటుడు, శ్రీవిద్యానికేతన్ సంస్థల నిర్వాహకులు మోహన్ బాబు ర్యాలీ చేయడం, ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం, టీడీపీ నేతలు విమర్శలు గుప్పించడం తెలిసిందే. మోహన్ బాబు, ఆయన ఇద్దరు కుమారు చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఓ లేఖను విడుదల చేశారు. అందులో ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం గవర్నమెంటుకు తాను రాసిన లెటర్స్ ను, ప్రభుత్వం ఎంత చెల్లించాల్సి ఉందో మొత్తం లెక్కలతో సహా పోస్ట్ చేశాడు. దీనికి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. మంచు ఫ్యామిలీ వైసీపీకి సపోర్ట్ అంటూ, రాజకీయ లబ్ది కోసమే ఇలా చేస్తున్నారని కొంతమంది ఫైర్ అవుతున్నారు. అయితే ఈ కామెంట్స్ పై స్పందించిన రాజకీయ మంచు మనోజ్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. రాజకీయ ప్రయోజనాల కోసం తాము రోడ్డెక్కలేదని, మంచిని పంచడానికి కులం, మతం అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు.

Related posts